సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాతో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రం తో తన 28వ సినిమా చేస్తున్నాడు మహేష్.
ఈ సినిమా లో పూజా హెగ్దే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక మహేష్ ఫ్యాన్స్ కోసం ఉగాది కానుకగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నారట.త్రివిక్రం సినిమాలకు ముందు టైటిల్ ఎనౌన్స్ చేసి ఆడియన్స్ లో అంచనాలు పెంచుతాడు.
ఈ క్రమంలో మహేష్ సినిమాకు అదే పంథా కొనసాగిస్తున్నాడు.
ఉగాది సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు.టైటిల్ రివీల్ తో పాటుగా టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.హారిక హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా మహేష్ లుక్స్ ఇంకా స్క్రీన్ ప్లే అదిరిపోతుందని చెబుతున్నారు.