టాలీవుడ్లో ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.
ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి చరిత్రను సృష్టిస్తుందా అని కూడా వారు ఆశగా చూస్తు్న్నారు.అయితే రాజమౌళి ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా ‘ఆర్ఆర్ఆర్’పై పెట్టడంతో మహేష్ బాబు సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే ఈ సినిమా తరువాతే రాజమౌళితో సినిమాలో జాయిన్ అవుతాడు మహేష్.
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు జక్కన్న అండ్ టీమ్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేసింది.ఈ సినిమా రిలీజ్ నుండి సంక్రాంతి వరకు జక్కన్న మహేష్ కోసం ఎదురుచూస్తూ ఉండాలన్నమాట.
అయితే సంక్రాంతి తరువాత మహేష్తో సినిమాను అనౌన్స్ చేసినా, ఆ సినిమా తొందరలో పట్టాలెక్కదనే వార్త వినిపిస్తోంది.ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సినిమా సెట్స్పైకి వెళ్లే సరికి వేసవి రావడం ఖాయం.
మరి మండుటెండలో మహేష్ బాబు షూటింగ్ చేస్తాడా అనే సందేహం పలువురిలో నెలకొంది.
కానీ వారందరికీ షాకిస్తూ మహేష్ ఈ సినిమా షూటింగ్ను వేసవిలోనే మొదలుపెట్టాలని చూస్తున్నాడట.
ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఈ సినిమా కోసం ఎంతటి కష్టానైనా ఓర్చుకునేందుకు మహేష్ ఫిక్స్ అయ్యాడట.దీంతో ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటినుండే ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.
మరి ఈ సినిమాను ఎలాంటి జోనర్ కథతో తెరకెక్కిస్తారో, ఈ సినిమాలో మహేష్ ఎలాంటి లుక్స్తో కనిపిస్తాడో, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.