టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉండగా పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా బరిలో నుండి తప్పుకుంది.ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది.
ఏప్రిల్ 1, 2022 న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా స్టార్ట్ చేస్తాడని అంత భావించిన మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఇక ఇప్పుడు వీరి కాంబోలో మరొక సారి సినిమా రాబోతుంది.
ఇక మూడవసారి రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.మహేష్ కెరీర్లో 28వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.అయితే తాజాగా మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.మహేష్ బాబు త్రివిక్రమ్, థమన్, నాగవంశీ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ”వర్క్ అండ్ ఛిల్ల్… ఈ మధ్యాహ్నం ఈ టీమ్ తో కలిసి పనులు సాగుతున్నాయి” అంటూ మహేష్ పోస్ట్ షేర్ చేసారు.
ఈ మీటింగ్ దుబాయ్ లో జరిగినట్టు తెలుస్తుంది.ఈ ఫోటో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.