నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా ?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఊహించని విధంగా బొక్కబోర్లాపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు పంపిణిదారులు .

సినిమాకి పెట్టినదాంట్లో అతికష్టం మీద సగం తిరిగివచ్చేలా ఉన్నాయి .

ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి నిర్మాత పివిపిని ఆశ్రయించారు బయ్యర్లు .మొదట వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబుతో సినిమా తీసి , దాంతో నష్టపరిహారం చెల్లిస్తానని నిర్మాత అడగ్గా దాన్ని తిరస్కరించారు బయ్యర్లు .చివరకి 40% కన్నా ఎక్కువ నష్టాలు వస్తే ఆ పంపిణిదారుడికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు నిర్మాత .ఇక తాజాగా అందిన సమాచారం ఏంటంటే , నష్టాల భారం కేవలం నిర్మాతపైనే రుద్దట్లేదు మహేష్ .సగభాగం నిర్మాత ,సగ భాగం మహేష్ చేల్లిస్తారట బయ్యర్లకి .మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీవర్గాలు హర్షం వ్యక్తం చేసాయి .ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో పాటు సేదదీరుతున్న ప్రిన్స్ , హైదరాబాద్ కి వచ్చిరాగానే బయ్యర్లకి సహాయం అందిస్తారు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు

తాజా వార్తలు