మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ .పేరుకి సెలబ్రిటి జంటే అయినా, అసలు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నట్లు పెళ్ళి జరిగేదాకా కూడా తెలిదు.
మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు అప్పటికి నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.అసలు మీడియాకి చిక్కకుండా, అభిమానులకి కూడా అందకుండా జరిగిపోయింది మహేష్ బాబు పెళ్ళి.
ఆ పెళ్ళి అనుభవాల్ని ఒక జాతీయ పత్రికతో పంచుకున్నారు ఈ దంపతులు.అవేంటో వాళ్ళ మాటల్లోనే.
” అతడు షూటింగ్ జరుగుతోంది అప్పుడు.రాత్రిదాకా షూటింగ్ లో పాల్గొని, పొద్దునే పెళ్ళికి బయలుదేరాను.
నేనేమి నెర్వస్ గా ఫీల్ అవలేదు కాని ఇది ఎవరికీ తెలియకుండా జరుగుతున్న పెళ్ళి కాబట్టి బయట జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచించాను, నమ్రత జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది.నేను సింపుల్ గా ఉండటం తనవల్లె నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్.
” పెళ్ళికి వారం ముందే నాకున్న కమిట్మెంట్స్ అన్ని పూర్తీ చేసుకున్నాను.అప్పుడు నేను చాలా బిజీ.
కాని అక్క, పేరెంట్స్ దగ్గరుండి అన్ని చూసుకున్నారు.చాలా సింపుల్ గా జరిగింది మా పెళ్ళి.
నాకేమో తెలుగు రాదు.కాని పంతులుగారు సంస్కృతంలో మంత్రాలు చదువుతూ నాకు హిందీలో అర్థాలు చెప్పడం భలేగా అనిపించింది.
మహేష్ తో ఏడు అడుగులు నడుస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను.మహేష్ తనకున్న పెద్ద జీవితాన్ని,పేరుని ఇంటికి తీసుకురాడు.
ఇంట్లో తానూ మంచి భర్త .మంచి తండ్రి .మామూలు మనిషి ” అంటూ తన అనుభవాల్ని పంచుకుంది సూపర్ స్టార్ సతీమణి.