తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళ కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సూపర్ డూపర్ హిట్లను కూడా అందుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఎన్ని సినిమాలు చేసిన కూడా ఒక సినిమా మిస్ చేసుకున్నందుకు మహేష్ బాబు తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు.అది ఏ సినిమా అంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది( Attaritiki Daredi )…ఈ సినిమాని త్రివిక్రమ్ మొదట మహేష్ బాబుతో చేయాలనుకొని ఖలేజా సినిమా సమయంలోనే ఆ స్టోరీ ని మహేష్ బాబు కి చెప్పాడట.అయితే ఖలేజా సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాలనే ఉద్దేశ్యాన్ని అప్పుడు మహేష్ బాబు మానుకున్నాడు.
ఇక దాంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్( Business man ) అనే సినిమా చేశాడు.ఇక త్రివిక్రమ్ ని పట్టించుకోకుండా మహేష్ బాబు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాడు.

అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ సక్సెస్ అయింది.దాంతో మహేష్ బాబు ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఆ విషయాన్ని చాలా సార్లు తెలియజేసినట్టుగా అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువడ్డాయి…ఇక మొత్తానికైతే ఒక సూపర్ హిట్ సినిమాను వదులుకొని మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం సినిమా చేసి భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు…
.







