సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు తమ సినిమా ముచ్చట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు.ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు.
అక్కడి హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా సంపాదన కూడా మొదలు పెట్టేశారు.సోషల్ మీడియా పేజీల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న తారలలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి అందాల భామలు ముందు వరుసలో ఉన్నారు.
రణవీర్ సింగ్ లాంటి హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా భాగానే ఆర్జిస్తున్నారు.అయితే హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ ఎక్స్ ట్రా ఇన్కమ్ కోసం ఉపయోగిస్తూ ఉంటే హీరోలు మాత్రం ఎక్కువగా ఫ్యాన్స్ కి తమ సినిమా అప్డేట్స్ అందించడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.
ఇక సౌత్ లో కూడా హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో వీడియో చాటింగ్ ద్వారా సినిమా విశేషాలని పంచుకుంటారు.
అలాగే ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు.
అయితే సౌత్ హీరోలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరనే పేరు ఉంది.అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ వెకేషన్, పిల్లలకి సంబందించిన విషయాలని పంచుకోవడంతో పాటు తన సినిమా అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలో ట్విట్టర్ లో అతన్ని ఫాలోఅయ్యే వారు భారీగానే ఉన్నారు.ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న హీరోగా అరుదైన రికార్డ్ ని మహేష్ బాబు క్రియేట్ చేశాడు.
అతని ట్విట్టర్ ఫాలోవర్స్ ఏకంగా 14 లక్షల మంది ఉన్నారు.ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.
ఇతని తరువాత స్థానంలో మిగిలిన స్టార్ హీరోలు అందరూ ఉన్నారు.ఇన్స్టాగ్రామ్ లో అయితే అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న హీరోగా రౌడీ స్టార్ విజయ్ ఉండటం విశేషం.