నేను నాగ చైతన్య చెల్లిని అంటూ షాక్ ఇచ్చిన మధురవైన్స్ హీరోయిన్?

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రధారులుగా జయకిశోర్‌ బండి దర్శకత్వంలో రాజేష్, సృజన్‌ నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్‌’.తాజాగా విడుదల అయింది.

కాగా కొన్ని సరదా ముచ్చట్లతో ఆ సినిమా బృందం ఒక ఇంటర్వ్యూలో సందడి చేశారు.తనకు పుష్ప సినిమా చూడాలని ఉందని మధుర వైన్స్ హీరోయిన్ ప్రముఖ నటి సీమా చౌదరి అన్నారు.

ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ఎదురుచూస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.ఇంతకుముందు ఫలానా వారితో చేయాలనే కోరిక అని గాని వీరితో చేయాలని ఆశ అని ఏమి లేకపోయేది అని సీమ చౌదరి అన్నారు కానీ ఇప్పుడిప్పుడే అందరినీ చూస్తున్నానని ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సీమా చౌదరి తెలియజేశారు.ఇప్పుడిప్పుడే పాత్రల గురించి అవగాహన కలగడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సరసన నటించాలని ఉందని ఈ సందర్భంగా తన మనస్సులోని మాటను బయట పెట్టారు.

Advertisement

నాగ చైతన్యకి సిస్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు రావు రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే డైలాగులు చూసి ఇంత గొప్ప నటులతో చేస్తున్నానా అని ఆమె అనుకున్నట్టు చెప్పారు.ఇంకా ఇలాంటి టాలెంట్ ఉన్న నటులు అందరితోనూ తాను కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్టు ఆమె వివరించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు