టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమా టీజర్ను జనవరి 10న ఉదయం 10.08 గం లకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.దీంతో ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో నెలకొంది.
ఇక ఈ టీజర్ను శేఖర్ కమ్ముల ఎలా మలిచాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకును ఇంప్రెస్ చేయడంతో సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల మధ్య నడిచే రొమాన్స్ యూత్ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, వారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో రావు రమేష్, పోసాని వంటి నటీనటులు నటిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.