ఆమె గిరిజ‌నుల‌పై అమిత‌మైన ప్రేమ కురిపించిన దేవి... ప‌ద్మ విభూష‌న్ అందుకున్న మ‌హాశ్వేతాదేవి జీవితం సాగిందిలా...

మహాశ్వేతా దేవి తన రచనల‌ను సామాజిక మార్పున‌కు ఆయుధంగా మార్చుకున్నారు.ఆమె పాత్రికేయురాలు, రచయిత్రి, సాహితీవేత్త, ఉద్యమకారిణిగా గుర్తింపు పొందారు.

 Life Of Mahashweta Devi Who Received The Padma Vibhushan , Mahashweta Devi , Pad-TeluguStop.com

మహాశ్వేతా దేవి 1926 జనవరి 14న బంగ్లాదేశ్‌లో జన్మించారు.ఆమె బెంగాలీ భాషా రచయిత్రి.

అయిన‌ప్ప‌టికీ ఆమెకు ప్రతి భాషలోనూ,అన్నిసమాజాల‌లోనూ ప్రత్యేక గౌరవం లభించింది.మహాశ్వేతా దేవి తండ్రి మనీష్ ఘటక్ కవి, నవలా రచయిత.

ఆమె తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత్రి, సామాజిక కార్యకర్త.మహాశ్వేతా దేవి తన రచనల్లోనే కాకుండా తన జీవితాంతం సమాజంలోని అన్ని వర్గాల కోసం పోరాడారు.

ఆంగ్ల భాషలో బీఏ, ఎంఏ డిగ్రీభారతదేశ విభజన సమయంలో మహాశ్వేతా దేవి కుటుంబం పశ్చిమ బెంగాల్‌లో ఉండేది.మహాశ్వేతా దేవి శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్శిటీ నుండి ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్‌గా బీఏ ఉత్తీర్ణులయ్యారు.

ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో ఎంఏ చేశారు.దీని తరువాత ఆమె ఉపాధ్యాయురాలిగా, పాత్రికేయురాలిగా తన జీవితాన్ని ప్రారంభించారు.

కొన్ని రోజుల తర్వాత కలకత్తా యూనివర్సిటీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా నియమితులయ్యారు.మహాశ్వేతా దేవి ప్రధాన రచనలుమహాశ్వేతా దేవి మొదటి పుస్తకం, ఝాన్సీ కి రాణి.1956లో ఇది వెలువ‌డింది.రెండవ పుస్తకం 1957లో అగ్నిశిఖ పేరిట వచ్చింది.

Telugu Aranyer Adhikar, Jhansi Ki Rani, Literary, Mahashweta Devi, Padma Vibhush

ఆమెకు సంబంధించిన క్లాసిక్ రచన.అటవీ హక్కుదాల‌పై జ‌రుగుతున్న‌ దోపిడీని ఎత్తి చూపారు.అరణ్యర్ అధికార్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటును ప్రేరేపించిన బిర్సా ముండా ఆధారంగా రూపొందించిన‌ నవల.1979లో ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.ఆమె నవలలు దాదాపు 100 ప్రచురిత‌మ‌య్యాయి.అనేక రచనలపై సినిమాలు కూడా నిర్మిత‌మ‌య్యియి.ఇందులో 1968లో సంఘర్ష్, 1993లో రుడాలి, 1998లో హజర్ చౌరాసి కీ మా, 2006లో మతి మై ప్రముఖమైనవి.ఎన్నో అవార్డులతో సత్కారంమహాశ్వేతా దేవి ప్రాథమికంగా బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ గిరిజనుల ప్రయోజనాల కోసం పోరాడారు.1979లో మహాశ్వేతకు అరణ్యేర్ అధికార్‌కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

Telugu Aranyer Adhikar, Jhansi Ki Rani, Literary, Mahashweta Devi, Padma Vibhush

1986లో పద్మశ్రీ, 1996లో జ్ఞానపీఠ్‌, రామన్‌ మెగసెసే అవార్డులు అందుకున్నారు.2006లో ఆమెకు పద్మవిభూషణ్ బిరుదు లభించింది.బిజోన్ భట్టాచార్యతో వివాహంమహాశ్వేతా దేవి ప్రఖ్యాత నాటక రచయిత బిజోన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు.భట్టాచార్య ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు.1962లో నవరుణ్ అనే కొడుకు పుట్టిన తర్వాత ఈ జంట విడిపోయారు.మహాశ్వేతా దేవి 28 జూలై 2016లో మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube