టీఆర్ఎస్ పేరు మార్చామని ఈసీకి లేఖ

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ పేరును మార్చామని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు లేఖ రాశారు.

రాజ్యాంగంలో ఉన్న నిబంధనల మేరకు పేరు మార్పుకు అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన ఏకవాక్య తీర్మానాల కాపీలను ఈసీకి అందజేయనున్నారు.

ఈ మేరకు మాజీ ఎంపీ వినోద్, శ్రీనివాస్ రెడ్డితో పాటు లీగల్ టీం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు