టార్గెట్ మార్చుకున్న రాధేశ్యామ్ !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యిందని కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ ఎప్పటి నుండో చెబుతున్న మాట.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Advertisement

అయితే ఇప్పుడు ఆ డేట్ కు కూడా ఈ సినిమా వచ్చేలా కనపడడం లేదు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం లాక్ డౌన్ ఉంది.ఈ పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేదు.

ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కు జనం రాలేని పరిస్థితి.అనువల్ల ఈ సినిమా జులై లో రావాలన్న టార్గెట్ మార్చుకునిన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంకా కొద్దిగా ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్న షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి.అందువల్ల రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది.

మరి చూడాలి చివరకు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు