సూర్యాపేట జిల్లా:29 న హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడినట్లు నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.ఈనెల చివరి వారంలో పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం ఉండటంతో వాయిదా పడ్డట్లు తెలిపారు.
దీనితో కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 29 న నిర్వహించదలచిన పలు అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవములు వాయిదా వేయడం జరిగిందన్నారు.తిరిగి కేటీఆర్ పర్యటన తేదీని త్వరలోనే శాసనసభ్యులు శానంపుడి సైదిరెడ్డి ప్రకటిస్టారని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.