కేటీఆర్ రాజీనామా చేయాలి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారని ఆరోపించారు.

ఐటీ శాఖ విఫలంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని బండి సంజయ్ విమర్శించారు.బీఆర్ఎస్ లో ఉన్న రేణుక కుటుంబం కోసమే పేపర్ లీక్ చేశారన్నారు.

అక్రమంగా రేణుకకు గురుకుల పాఠశాలలో ఉద్యోగం ఇచ్చారని మండిపడ్డారు.దీనిపై సిట్ తో ఉపయోగం లేదన్న బండి సంజయ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు