అఖండకు కొండపొలం దెబ్బ పడనుందా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుండీ బాలయ్య సినిమా కోసం ఆయన అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

బాలయ్య బొమ్మకు మాస్ ప్రేక్షకుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే.ఇక అలాంటి మాస్ హీరోకు ఊరమాస్ డైరెక్టర్ తోడయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనేదానికి గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలే సాక్ష్యం.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబో వస్తుండటంతో ‘అఖండ’ సినిమాపై అందరి చూపులు ఉన్నాయి.అయితే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దాదాపు ఇదే విషయం కన్ఫం అనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటంతో ఈ సినిమాను దసరాకు చూసి తీరాలని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అవుతున్నారు.అయితే ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు కూడా లైన్ కడుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం కూడా తొలుత దసరా కానుకగా రాబోతుందనే టాక్ వినిపించింది.కానీ ప్రస్తుతం ఆచార్య సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో, మరో మెగా హీరో సినిమాను దసరా రేసులో రిలీజ్ చేసేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొండ పొలం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

ఈ సినిమాను పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమా రిలీజ్ ఎఫెక్ట్ ‘అఖండ’ చిత్రంపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు