కెరీర్ ముగిసిపోయిందంటూ ఆ వ్యాఖ్యలు చేసిన కైరా అద్వానీ?

కైరా అద్వానీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాలీవుడ్ లో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె వెబ్ సిరీస్ లు, సినిమాలు అని తేడా లేకుండా కెరీర్ కొనసాగిస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోతుంది.మహేష్ బాబు సరసన ఏమాత్రం తగ్గకుండా నటించి టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది.

ఇక అలానే రామ్ చరణ్ సరసన వినయ విధాయ రామ సినిమాలో నటించి నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆకూ చాటు అందాలు అన్నట్టు అరటి ఆకుల వెనుక ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అప్పట్లో కొద్దిరోజులుగా పాటు కైరా అద్వానీ ట్రోల్ కూడా అయ్యింది.

ఇక అలాంటి ఈ నటి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ ప్రారంభంలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడింది.

Advertisement

అప్పట్లో ఎన్నో ఇబ్బందులు పడినట్టు ఆమె చెప్పుకొచ్చింది.మొదటి సినిమాపై ఎన్నో ఊహలు పెట్టుకున్నట్టు కానీ ఆ సినిమా దారుణంగా నిరాశ కలిగించినట్టు చెప్పింది.

అంతేకాదు ఆ సినిమా వల్ల ఆమెకు సినీ అవకాశాలు వస్తాయని కూడా ఊహించలేదని కానీ అదృష్టవశాత్తు వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.తొలి సినిమా వల్ల కెరీర్ ముగిసిపోయిందన్న ఫీల్ కలిగినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంతేకాదు.ఆమె తొలి సినిమా అందరూ ధోని అనుకుంటారని 2014లో ఫగ్లీ సినిమాతో ఆమె ఎంట్రీ అయినట్టు ప్లాప్ వల్ల మళ్లీ సినిమాల్లో అవకాశమే లేదని ఫిక్స్ అయినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు