కియారా అద్వానీ. ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.
ఈమె తెలుగులోకి కూడా అడుగు పెట్టి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా కియారా అద్వానీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ సినిమాతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత ఈమెకు రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది.
అయితే ఈ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు.కానీ రామ్ చరణ్, కియారా జోడీకి మంచి మార్కులు పడ్డాయి.అందుకే వీరిద్దరి జోడీ మరోసారి తెరమీద కనిపించ నుంది.శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇక దీంతో ఈమె పేరు మారుమోగి పోయింది.శంకర్ సినిమాలో హీరోయిన్ లకు కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది.
ఈ సినిమాలో కూడా కియారకు కీలక పాత్ర ఉంటుందట.
దీంతో ఈ అమ్మడికి 2022 మెమరబుల్ ఇయర్ గా మారనుంది.ఇక ఇది పక్కన పెడితే తాజాగా అమ్మడు లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.వరుస ఫోటో షూట్స్ చేస్తూ అందరికి హీట్ పెంచేస్తుంది.
ప్రెసెంట్ ఈ అమ్మడు నటించిన భూల్ బులయా 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు.ఈ సినిమాలో కియాయ భయంకరమైన ఘోస్ట్ గా నటించింది.ఈమె ఏ రేంజ్ లో నటించిందో ఇప్పటికే ట్రైలర్ చుసిన వారికీ అర్ధం అయ్యింది.
అనీష్ బజ్మీ తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా నటన ఓ రేంజ్ లో చూపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగానే కియారా అద్వానీ వరుస ఫోటో షూట్స్ చేస్తుంది.తాజాగా ఈమె స్పెషల్ డిజైనర్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను మైమరపించింది.ఈమె మెరుపులకు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.
థైస్ షోతో నెట్టింట హీట్ పెంచేసింది.ప్రెసెంట్ ఈమె దిగిన ఈ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అయ్యింది.