తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తర్వాత కియరా అద్వానీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అవకాశాలు కూడా క్యూ కట్టాయి.
దీంతో ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టి చేసేస్తుంది.ఓ వైపు యంగ్ హీరోలతో, మరో వైపు సీనియర్ హీరోలకి జోడీగా ఈ అమ్మడు బాలీవుడ్ లో సందడి చేస్తుంది.
ఈ రెండు జెనరేషన్ హీరోలకి సరిపోయే విధంగా కియరా అద్వానీ లుక్స్ ఉండటంతో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.ఇదిల ఉంటే కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ కోసం కియరా అద్వానీని హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది.
త్వరలో తెలుగులో మూడో సినిమా చేయబోతున్నట్లు ఆమె కూడా క్లారిటీ ఇవ్వడంతో ఇది నిజమనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే కియరా అద్వానీకి అందరిలాగే డ్రీమ్ రోల్స్ ఉన్నాయంట.తాజాగా ఈ విషయాన్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది.ప్రస్తుతం తన కెరియర్ చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పిన కియరా.
భవిష్యత్తులో ఒకప్పటి హీరోయిన్ మధుబాల బయోపిక్ లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.ఆమె జీవితంలో ఎన్నో షేడ్స్ ఉన్నాయని వాటిని తెరపై ఆవిష్కరిస్తే మాత్రం కచ్చితంగా అవకాశం రావాలని కోరుకుంటా అని చెప్పుకొచ్చింది.
అలాగే స్కూల్ టైంలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా అని, ఈ నేపధ్యంలో తనలోని మార్షల్ ఆర్ట్స్ ప్రతిభని బయట పెట్టె విధంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీలో ఫైట్స్ చేసే హీరోయిన్ పాత్రలో నటించాలని కూడా ఉందని మనసులో మాటని కియరా బయటపెట్టింది.యాక్షన్ హీరోయిన్ గా కావాల్సిన లక్షణాలు ఎలాగూ కియరాలో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఆమె కోరిక తీరుతుందేమో చూడాలి.