అదానీ – హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.సెబీ విచారణను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తునకు సిట్ కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ క్రమంలోనే సెబీ విచారణలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం భారతీయ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం, సెబీ సేఫ్ గార్డులుగా ఉన్నాయని పేర్కొంది.
నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపింది.సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
అయితే అదానీ – హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం దీనిపై నిజానిజాలు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.







