కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పోషిస్తుంది.. మోదీ

తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందని ఆరోపించారు.

కేసీఆర్ సర్కార్ అవినీతి రాష్ట్రం దాటి ఢిల్లీ వరకు పాకిందని విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఊహించలేనంత అవినీతికి పాల్పడిందన్న మోదీ అవినీతి లేకుండా ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.

మోదీని, కేంద్రాన్ని విమర్శించడమే వారి మొదటి పని అని తెలిపారు.కుటుంబ పాలనను నిలబెట్టుకోవడం రెండో పనని చెప్పారు.

దాంతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పనిగా నాశనం చేశారన్నారు.ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారని విమర్శలు చేశారు.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిని ప్రజలు చూశారన్న మోదీ వారి విషయంలో ఇకనైనా జాగ్రత్త పడకపోతే రాష్ట్రం నష్టపోతుందని వెల్లడించారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు