దేశ వ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి విస్తరణపై ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.ఇందులో భాగంగా అబ్ కీ బార్ కిసాన్ నినాదంతో గులాబీ బాస్ ముందుకు వెళ్తున్నారు.
డిసెంబర్ నెలాఖరుకి బీఆర్ఎస్ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగించనున్నారు.త్వరలోనే ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ప్రారంభానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో క్రిస్మస్ తరువాత ఆరు బీఆర్ఎస్ కిసాన్ సెల్ లను ఆయన ప్రారంభించే అవకాశం ఉంది.ఇప్పటికే పలువురు పొరుగు రాష్ట్రాల నేతలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ భావజాల వ్యాప్తిపై కూడా దృష్టి సారించారు.పలు భాషల రచయితలు, సాహితీ వేత్తలతో సమాలోచనలు చేస్తున్న కేసీఆర్ డిసెంబర్ చివరిలో జాతీయ మీడియాలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.







