టీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న ప్రచారాలకు నేడు కేసీఆర్ స్పష్టత ఇస్తాడా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలంగా దూసుకెళ్తున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పై రోజురోజుకు విమర్శల దాడి పెంచుతూ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఈ సందర్భంలో టీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తూ మంత్రులపై, కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ అదే విధంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా రకరకాల అంశాలు ప్రచారం ప్రజల దృష్టిని బీజేపీ వైపు మరల్చేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేస్తోంది.

 Will Kcr Clarify The Ongoing Campaign Against The Trs Party , Cm Kcr, Ktr As Nex-TeluguStop.com

ఇక వీటన్నింటిపై కేసీఆర్ ఇప్పటికీ ఒక్కసారిగా స్పందించలేదు.ఈ సందర్భంలో నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఇతర నాయకులతో కలిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ కార్యవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ సందర్బంగా కేటీఆర్ ను సీఎంగా చేయాలనే అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అంతేకాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు,ఇటీవల ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇటువంటి విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.చూద్దాం మరి కేసీఆర్ వీటన్నింటి విషయాల మీద స్పష్టత ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube