చర్మంపై మృత కణాలు ఏర్పడటం సర్వ సాధారణం.అయితే వీటిని త్వరగా తొలిగించుకోకుంటే మాత్రం చర్మం కాంతి హీనంగా మారిపోవడమే కాదు.
మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.అందుకే ముఖం అందంగా మెరవాలంటే మృతకణాలను వదిలించుకోవాల్సిందే అని బ్యూటీషన్లు చెబుతుంటారు.
దీంతో చాలా మంది డెడ్ స్కిన్ సెల్స్ను తొలిగించే క్రీములు వాడుతుంటారు.కానీ, న్యాచురల్గా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మృతకణాలను నివారించడంలో యాపిల్ గ్రేట్గా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, తేనె మరియు బ్రౌన్ షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్లతో మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.
ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే.డెడ్ స్కిన్ సెల్స్ పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
అలాగే ఓట్స్తో కూడా మృతకణాలను తగ్గించుకోవచ్చు.ఓట్స్ను మెత్తగా పౌడర్ చేసి.
అందులో చిటికెడు బేకింగ్ సోడా మరియు హాట్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.
డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కొద్దిగా వాటర్ జల్లి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కాఫీ పౌడర్, అలోవెరా జెల్ మరియు నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకుని.సర్కిలర్ మోషన్లో స్క్రబ్ చేయాలి.
ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే మృతకణాల సమస్యే ఉండదు.
దాంతో మీ చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా కనిపిస్తుంది.