టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.ఇలా పలు భాషలలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని మలయాళంలో కూడా ఈనెల 23వ తేదీ ఎంతో ఘనంగా విడుదల చేశారు.
ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.
ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి సుమారు 130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 3 కూడా రాబోతుందని ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందంటూ నిఖిల్ సీక్వెల్ చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీ ప్రసారం చేయనున్నట్లు జీ5 అధికారికంగా తెలియజేశారు.దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది అయితే ఇదే రోజే థియేటర్లో నాగార్జున నటించిన ది ఘోస్ట్, చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.ఇలా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ కార్తికేయ 2 కూడా ఓటీటీలో విడుదల చేయడం విశేషం.