బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలను ఆయన తన పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించి ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగిన ఈయన ఎన్నో తెలుగు సినిమాలను హిందీలో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రముఖ సెలబ్రిటీలతో మంచి పరిచయాలను ఏర్పరుచుకున్నారు.
ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మే 25వ తేదీ తన 50వ పుట్టిన రోజు వేడుకల కోసం సౌత్ నుంచి నార్త్ వరకు సెలబ్రిటీలను ఆహ్వానించి ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలు ఒక్కసారిగా ఈ పార్టీలో తళుక్కుమన్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ దంపతులు, విక్కీ కౌశల్ కత్రినా జంట, సల్మాన్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు.
అదేవిధంగా హీరో విజయ్ దేవరకొండ, రష్మిక తమన్నా, జాన్వీ కపూర్, ఛార్మి,డైరెక్టర్ పూరి జగన్నాథ్ వంటి వారు కూడా ఈ పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు.ఈ విధంగా నార్త్ నుంచి సౌత్ సెలబ్రిటీల వరకు ఒకేచోట హాజరు కావడంతో ఆ ప్రాంతమంతా తారలతో మెరిసిపోయింది.ఇకపోతే కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం వీరి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.