నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.అప్పటి నుండి కళ్యాణ్ రామ్ కి సక్సెస్ అనేది లేదు.
అంతకు ముందు అతనొక్కడే సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు.ఇన్నాళ్ల సినీ కెరీర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే మరియు పటాస్ లతో మాత్రమే సక్సెస్ లు దక్కించుకున్నాడు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా బింబిసార సినిమా తో సక్సెస్ టాక్ ను పొందాడు.
భారీ బడ్జెట్ తో రూపొందిన బింబిసార సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో వసూళ్లు భారీ గా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఈ ఏడాది లో కేవలం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ లకు కూడా అద్భుతమైన విజయాలు నమోదు అయ్యాయి.
ఇప్పటికే 2019 సంవత్సరం లో ఏకంగా మూడు బిగ్గెస్ట్ సక్సెస్ లను నందమూరి హీరోలు చూశారు.
అందులో అఖండ మొదటిది కాగా.
రెండవది ఆర్ ఆర్ ఆర్.ఈ రెండు సినిమా లు కూడా బాలయ్య ఎన్టీఆర్ అభిమానులను ఆకాశం లో తీసుకు వెళ్లి కూర్చోబెట్టాయి.
ఇప్పుడు బింబిసార కూడా అదే స్థాయి సినిమా అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖండ సినిమా గత ఏడాది చివర్లో విడుదల అయినా కూడా సందడి మొత్తం ఈ ఏడాదిలోనే కొనసాగింది.
అందుకే అఖండ ను కూడా 2019 మూవీ గానే ప్రేక్షకులు భావించి ఈ సంవత్సరం నందమూరి ఫ్యామిలీ హీరోలకు బాగా నే కలిసి వచ్చిందని అంటున్నారు.కుటుంబం పరంగా ఉమామహేశ్వరిని కోల్పోయినా కూడా హీరోలకు సక్సెస్ లు దక్కడంతో మంచి ఆనందంతో అభిమానులు ఉన్నారు.
ముందు ముందు కూడా ఈ ముగ్గురు నందమూరి హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటూ బలంగా కోరుకుంటున్నారు.