తెలుగింటి చందమామ కాజల్ అగర్వాల్ ఒక దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఈ మధ్యనే ప్రియుడు కిచ్లు ను పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగు పెట్టింది.
పెళ్లి తర్వాత కూడా వరసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.అందం, అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది.
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ స్పీడు పెంచింది.
మంచు విష్ణు తో మోసగాళ్లు, కమల్ హాసన్ తో భారతీయుడు 2, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేస్తుంది.పెళ్లయిన తర్వాత భర్త గౌతమ్ కిచ్లుతో వెళ్లిన హనీమూన్ ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా కాజల్ ఒక విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
కాజల్ తనకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసిందని తెలిపింది.దీనివల్ల తను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే దానినని తెలిపింది.వింటర్ సీజన్ వస్తే వ్యాధి తీవ్రత మరింత ఉండేదని దీనివల్ల దుమ్ము ధూళిలోకి వెళ్తే మరిన్ని ఇబ్బందులు ఉండేవని కాజల్ వెల్లడించింది.
అయితే ఆస్తమా తగ్గించుకోవడానికి ఇన్ హెలర్స్ వాడడం వల్ల కాస్త ఉపశమనంగా ఉండేదని.
అందుకే ఎప్పుడు తన వెంట ఒక ఇన్ హెలర్ ఉంచుకుంటూ ఉంటానని కాజల్ చెప్పింది.అందరి ముందైనా ఇన్ హెలర్ ఉపయోగిస్తానని.ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని కాజల్ వివరించింది.
ఈ విషయం గురించి కాజల్ అందరికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేసింది.
అందుకోసం కాజల్ ‘సే ఎస్ టు ఇన్ హేర్స్’ అని టాగ్ చేస్తూ తన ఇన్స్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది.