8 లక్షల కోట్లు ఉన్న విశాఖ ఉక్కును ప్రధాని మోడీ తన ప్రియ మిత్రుడు అయిన ఆదానికి కేవలం నాలుగు వేల కోట్లకు కారుచౌకగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే ఏ పాల్ అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా విశాఖ లో ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ…
ఆదాని, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని అన్నారు.సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఐదు ప్రతిపాదనలు తెలియచేసారు.
మోదీ, అమిత్ షా, రూపాల.తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మం అని ప్రకటన చేయాలి అని లేకపోతే నేను నా ఆమరణ నిరాహార దీక్షను విరమించనని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా పోరాటం చేయాలని అన్నారు.