యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఈసారి కూడా అంతే స్థాయిలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్నారు.
అయితే వీరి ఎదురు చూపులకు ఫలితం ఇంకా రాలేదు.దీంతో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఈ సినిమాను ఇంకా సెట్స్ మీదకు కూడా తీసుకు వెళ్ళక పోవడంతో అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా ఎటువంటి అప్డేట్ లు ఇవ్వలేదు.కానీ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీమ్.
అయితే ఏడాదినే రిలీజ్ అవుతుంది అని అంతా భావించారు.కానీ కొరటాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు.2024లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా ప్రకటించింది.ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని కూడా కన్ఫర్మ్ చేసారు.
అయితే కొరటాల ఈ సినిమాను ఒక యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేస్తున్నట్టు టాక్.
సముద్రం నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు.ఈ సీక్వెన్స్ లో అయితే ఎన్టీఆర్ ఫుల్ మాస్ అండ్ రఫ్ అవతార్ లో కనిపిస్తారట.చూడాలి మరి ఈ సినిమాను కొరటాల ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో.
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.మొత్తానికి తొందరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అని అంటున్నారు.