తన సినీ కెరీర్ లో మోహన్ బాబు చాలా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు తప్పు చేయడం వల్ల వివాదాల్లో నిలిస్తే మరికొన్ని సందర్భాల్లో ఆయన తప్పు లేకపోయినా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.కొన్ని విషయాలలో తప్పు లేకపోయినా లాగబాడతామని ఆయన తెలిపారు.
విజయవాడలో నా శతకం ఒకటి ప్రింటింగ్ జరుగుతున్న సమయంలో ఆ పని ఆలస్యం కావడంతో దేనికైనా రెడీ సినిమా చూశానని జొన్నవిత్తుల తెలిపారు. టెక్నికల్ గా ఆ సినిమా బాగానే ఉన్నా ఆ సినిమాల్లో ఒకచోట “సంభావన ఎక్కువ పడేస్తె తోకాడిస్తూ వస్తారు అని డైలాగ్ ఉంటుందని ఆ డైలాగ్ వినగానే కోపం వచ్చిందని జొన్నవిత్తుల పేర్కొన్నారు.
తోకాడిస్తూ వస్తారని కామెంట్ చేయడం ఏంటని ఆయన వెల్లడించారు.
వేద పండితులను ఎలా చూస్తారని అనిపించిందని జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.బ్రహ్మానందం సురేఖావాణి సంభాషణ చిరాకు తెప్పించేలా ఉంటుందని ఆమె పాత్ర మా ఆయనలా ఉన్నాడని ఎవరిని చూసినా చెప్పడం ఏంటని ఆయన తెలిపారు.ప్రపంచంలో ఏ స్త్రీ అయినా మా ఆయనలా ఉన్నారా అని అంటుందా అని జొన్నవిత్తుల కామెంట్లు చేయడం గమనార్హం.
ఇందుకు సంబంధించి నా అభ్యంతరాలు నేను చెప్పానని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత నా మీద పరువు నష్టం దావా వేశారని జొన్నవిత్తుల అన్నారు.బ్రాహ్మణులకు కోపం వచ్చి పిండాలు, శాపనార్థాలు పెట్టారని ఆయన తెలిపారు.ఒక మహిళ కోపంతో చెప్పులు విసిరిందని ఆయన కామెంట్లు చేశారు.
ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదనే సంగతి తెలిసిందే.
తాజా వార్తలు