విశాఖలో జనసేన న్యాయపోరాటం

విశాఖలో తమ పార్టీ కార్యకర్తల విడుదల కోసం జనసేన న్యాయపోరాటానికి సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే నేడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

 Janasena Legal Battle In Visakha-TeluguStop.com

అయితే విశాఖలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.వీరిలో తొమ్మిది మందిని పోలీసులు రిమాండ్ లో ఉంచారు.

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్యాహ్నం వరకూ విశాఖలోనే ఉండనున్నారని సమాచారం.మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ కు వెళ్లనున్నారు.

మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో నోవాటెల్ హోటల్ పరిసరాలు, ఆర్కే బీచ్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.కాగా నిన్న బీచ్ రోడ్డుకు పవన్ అభిమానులు భారీగా రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube