రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారన్న చినరాజప్ప చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో న్యాయపోరాటం చేద్దామని చంద్రబాబు చెప్పారన్నారు.
టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.జగన్ పతనం మొదలైందన్న చినరాజప్ప త్వరలోనే జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.