వాలంటీర్స్ కావాలంటూ జనసేన పార్టీ కీలక ప్రకటన..!!

రేపటినుండి “వారాహి”( Varahi ) యాత్ర ప్రారంభం కానుంది.ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్ ఐటీ మరియు సోషల్ మీడియా విభాగాలకు సంబంధించి పార్టీ కోసం పనిచేయటానికి వాలంటీర్లు కావాలి అని జనసేన పార్టీ కీలక ప్రకటన చేయడం జరిగింది.

 Jana Sena Party's Key Announcement Asking For Volunteers , Janasena, Pawan Kalya-TeluguStop.com

ఈ క్రమంలో ఆసక్తి ఉన్నవాళ్లు 9281041479 నెంబర్ కి ఫోన్ చేయాల్సిందిగా కీలక ప్రకటన చేయడం జరిగింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) “వారాహి” యాత్రకి సిద్ధం కావడం జరిగింది.

జూన్ 13వ తారీకు మంగళవారం.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడ నుండే ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకుని ఆ తర్వాత అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి అక్కడినుండి “వారాహి” యాత్ర జూన్ 14 నుండి అనగా రేపటి నుండి ప్రారంభించబోతున్నారు.

ఉభయగోదావరి జిల్లా( Ubhayagodavari district )లలో ఈ యాత్ర పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు.

ఈ క్రమంలో వారాహి యాత్రలో స్వచ్ఛందంగా.గ్రౌండ్ లెవెల్ లో ఐటీ మరియు సోషల్ మీడియా విభాగాలకు సంబంధించి పనిచేయటానికి వాలంటీర్లు కావాలంటూ.

పార్టీ కీలక ప్రకటన చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో వారాహి యాత్రకు అంబులెన్స్ కూడా సిద్ధం చేసింది.“జనహిత” పేరుతో అంబులెన్స్ రెడీ చేయడం జరిగింది.ఈ వాహనం పవన్ కళ్యాణ్ యాత్రను అనుసరించనుంది.

అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో ఆధ్యాత్మిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి.రేపటినుండి పవన్ ప్రారంభించనున్న “వారాహి” యాత్ర ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube