విశాఖలో జనసేన ఆందోళన.. నెలకొన్న ఉద్రిక్తత

విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ జనసేన ఆందోళనకు పిలుపునిచ్చింది.

 Janasena Agitation In Visakha.. Tension-TeluguStop.com

ఈ క్రమంలోనే మహాధర్నాకు సిద్ధమైంది.

దీంతో టైకూన్ జంక్షన్ వద్దకు నేతలతో పాటు జనసైనికులు భారీగా తరలి వస్తున్నారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టుల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య చెలరేగిన వివాదంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు నోవాటెల్ హోటల్ దగ్గర జనసేన నేత నాదెండ్ల మనోహార్ ను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులపై మాట్లాడుతుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube