అర్జున్ రెడ్డి సినిమా నుంచి విజయ్ దేవరకొండ అనసూయ ( Vijay Devarakonda Anasuya )మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అనసూయ బుల్లితెరకు దూరమై ప్రస్తుతం సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండగా సోషల్ మీడియాలో వివాదాల ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఖుషి( kushi ) సినిమా నుంచి రిలీజైన కొత్త పోస్టర్ లో “ది దేవరకొండ”( The Devarakonda ) అని పేర్కొనడంతో విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండానే అనసూయ విమర్శలు చేశారు.
ఈ కామెంట్ తర్వాత కొంతమంది నెటిజన్లు అనసూయను టార్గెట్ చేయగా ఆమె స్పందిస్తూ “భలే రియాక్ట్ అవుతున్నారురా బంగారు.
బంగారు కొండలంట” అంటూ ఫ్యాన్స్ కు మండేలా అనసూయ కామెంట్లు చేశారు.ఎక్కడో అక్కడో నేను నిజం అనేది ప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని ఆమె చెప్పుకొచ్చారు.
కొంతమంది ఫ్యాన్స్ అనసూయను బూతులు తిట్టగా తప్పులు చేస్తున్న ఫ్యాన్స్ ను నిలదీయడానికి స్టార్స్ కు ఏం అడ్డొస్తుందని అనసూయ చెప్పుకొచ్చారు.
గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుందని నాకు వచ్చిన శక్తితో నేను బాధ్యతగా ఉన్నానని హీరోలెందుకు అలా లేరంటూ అనసూయ కామెంట్లు చేశారు.ఫ్యాన్ ఫాలోయింగ్ పోతుందనా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్ కదా? అని ఆమె కామెంట్ చేశారు.ఈ వివాదం గురించి జబర్దస్త్ మహీధర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనసూయ కావాలని టార్గెట్ చేసి రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తోందని ఆయన తెలిపారు.
విజయ్ దేవరకొండ ది అని పెట్టుకోవడంలో తప్పు లేదని మహీధర్( Mahidhar ) అభిప్రాయపడ్డారు.విజయ్ ది అని పెట్టుకుంటే అనసూయకు సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు.పవన్ కత్తి మహేష్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోందని మహీధర్ పేర్కొన్నారు.
అనసూయ గుర్తింపు కోసమే విజయ్ ను టార్గెట్ చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.విజయ్ మార్కెట్ తగ్గలేదని మహీధర్ అన్నారు.విజయ్ దేవరకొండది ఒక శాతం కూడా తప్పు లేదని ఆయన కామెంట్లు చేశారు.ఈ గొడవ ఎప్పటికీ ఆగదని ఆయన పేర్కొన్నారు.