జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో జరిగిన దాడిపై అనేక టిస్ట్ ల అనంతరం తాజాగా హై కోర్ట్ ఈ కేసుని ఎన్ఐఏ కు అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై వైసీపీ హర్షం వ్యక్తం చేయగా … టీడీపీ నేతలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నారు తాజాగా… ఈ వ్యవహారంపై ఐటీ మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచ్ వేశారు.

తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ని పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు’ అన్నారు కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదు.ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ కోడి కత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారు.తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ ని పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు లోకేష్.