జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.పవన్ కల్యాణ్ క్లబ్బులు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో పవన్ కు దమ్ముంటే నేరుగా తనను ప్రశ్నించాలని సవాల్ చేశారు.
పవన్ తెర వెనుక ఉండి మాట్లాడించడం సరికాదని తెలిపారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) ఎస్టేట్ కాపాడేందుకే పవన్ వచ్చారన్న ముద్రగడ పవన్ కల్యాణ్ ఇరవై సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయడం మంచిదని సూచించారు.







