ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆయన తెలిపారు.
పెండింగ్ లో ఉన్న ఫామ్ 7 మరియు 8 ల పరిష్కారంతో పాటు రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా సి-విజిల్( CVIGIL ) ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సీఈవో సూచించారు.కాగా మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.