మొదటగా అవకాశాల కోసం బాలీవుడ్నుంచి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి వచ్చి హీరోయిన్ గా ఒక హిట్ కొట్టిన తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమ కి వెళ్లి చేతులు కాల్చుకున్న హీరోహీరోయిన్లు చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.అయితే అందులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇజం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన అదిథి ఆర్య కూడా ఈ కోవకే చెందుతుంది.
కాగా ఈ చిత్రంలో హీరోగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించగా, ప్రముఖ సీనియర్ నటులు జగపతి బాబు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరించింది.
దీంతో అదితి ఆర్యకి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి ఆరంభం లభించినప్పటికీ ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు.
అయితే సినిమాల్లోకి రాకముందు అదితి ఆర్య మోడలింగ్ రంగంలో పని చేసింది.
ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా కూడా నిలిచింది.ఆ తరువాత తెలిసిన వారి ద్వారా ఇజం చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో నటన వైపు అడుగులు వేసింది.
వచ్చి రావడంతోనే మంచి ఆరంభం లభించడంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.దీంతో టాలీవుడ్ ని పక్కన పెట్టి బాలీవుడ్ లో నటించడానికి వెళ్ళిపోయింది.
కానీ దురదృష్టవశాత్తు ఇజం చిత్రం తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించిన తంత్ర, స్పాట్ లైట్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.దీంతో మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా పరిశ్రమ వైపు వచ్చింది.
ఈ క్రమంలో “7” అనే చిత్రంలో ప్రధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ అమ్మడు సినిమా కెరియర్ పూర్తిగా డౌన్ అయ్యింది.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు.దీంతో కన్నడ సినిమా పరిశ్రమలో “త్రిశూలం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా నిలిచిపోయిన ట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ అదితి ఆర్య కి తెలుగులో మంచి ఆరంభం లభించినప్పటికీ బాలీవుడ్ పై ఉన్నటువంటి మక్కువ కారణంగానే తెలుగులో అవకాశాలను పోగొట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.