దంచికొట్టిన ఢిల్లీ... రాజస్థాన్ టార్గెట్ 185 !

ఐపీఎల్ 13 వ సీజన్ లో భాగంగా శుక్రవారం షార్జావేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో ఢిల్లీ మొదటగా బ్యాటింగ్ చేసి , రాజస్దాన్ రాయల్స్ ‌ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.మెుదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ అరంభంలో కాస్త తడబడింది.

 Ipl, Ipl2020, Ipl13, Rr, Dc, Hetmyer,archer, Smith-TeluguStop.com

ఓపెనర్స్ పృథ్వీ షా 19, శిఖర్ ధావన్ 5 ఈ మ్యాచ్ లో మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు.ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22, రిషభ్ పంత్ 5 పరుగుల వద్ద రనౌట్ ‌గా పెవిలియన్ బాట పట్టారు.

ఈ సమయంలో పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన ఢిల్లీని అల్ రౌండర్ స్టాయినిస్‌ 39,హెట్ ‌మెయిర్ 45 పరుగులు చేసి అదుకున్నారు.చివరిలో టైలేండర్స్ కొంచెం బ్యాట్ ఝలిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

దీనితో రాజస్థాన్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 185 పరుగులు చేయాల్సి ఉంటుంది.

అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్‌, ఢిల్లీని బ్యాటింగ్ ను అప్పగించింది.

ఇక గత మ్యాచ్ అనుభవం నుండి పాఠాలు నేర్చుకున్న రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మార్పులు చేసింది.వరుణ్ ఆరుణ్, ఆండ్రూ టై తుది జట్టులోకి రాగా.

అంకిత్ రాజ్ ‌పుత్, టామ్ కరన్‌ బెంచ్‌ కు పరిమితమయ్యారు.ఇక ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా అదే టీం తో బరిలోకి దిగింది.

వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ‌లో ఎలాగైనా గెలిచి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.ఐదు మ్యాచ్‌ లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube