చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ జరగనుంది.ఈ మేరకు మూడు స్కాం కేసులలో మొత్తం ఆరు అంశాలపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

 Investigation On Chandrababu's Custody Petition And Bail Petitions-TeluguStop.com

ముందుగా చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ జరపాలని సీఐడీ అధికారులు కోర్టును కోరుతున్నారు.అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు.

ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఏ పిటిషన్ పై ముందుగా విచారణ చేస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అదేవిధంగా ఇవాళ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ పిటిషన్లపై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube