వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

 Investigation In Ys Viveka's Murder Case Is In Full Swing-TeluguStop.com

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు.ఈ క్రమంలో ఆమె సీబీఐ దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది.

సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు.అదేవిధంగా కేసులో మరో ఆరుగురిని కూడా సీబీఐ విచారించాలని తులసమ్మ కోరారు.

వివేకా హత్య కేసును పలు అంశాలు ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు.అసలు నేరస్థులను తప్పించి అమాయకులను వేధిస్తున్నారని తులసమ్మ ఆరోపించారు.

వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్ ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని వెల్లడించారు.తులసమ్మ పిటిషన్ పై తొమ్మిది నెలల తర్వాత వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube