రాజాసింగ్ హనుమాన్ శోభాయాత్రకు అంతరాయం

Interruption Of Rajasingh Hanuman Shobhayatra

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హనుమాన్ శోభాయాత్రకు అంతరాయం ఏర్పడింది.హైదరాబాద్ ధూల్ పేట గల్లీలో శోభాయాత్ర వాహనం ఇరుక్కుపోయింది.

 Interruption Of Rajasingh Hanuman Shobhayatra-TeluguStop.com

చిన్న చిన్న గల్లీలు కావడంతో ఎక్కడికక్కడ శోభాయాత్ర వాహనాలు నిలిచిపోతున్నాయి.

శోభాయాత్ర రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

కాగా శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు.మరోవైపు సీతారాంబాగ్ నుంచి వీహెచ్పీ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతోంది.

ఈ క్రమంలో మంగళ్ హాట్ చౌరస్తాలో రెండు శోభాయాత్రలు కలుసుకోనున్నాయి.కాగా శ్రీరాముని శోభాయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది.

హిందూ రాష్ట్రం కోసం ఛత్రి చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయిస్తానని రాజాసింగ్ చెబుతున్నారు.అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఛత్రి చౌరస్తాకు గుర్తింపు ఉంది.

దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube