సెల్ ఫోన్. ఈ పేరు తెలియని వారు బహుశా ఈ భూమి మీద ఉండరేమో.
ఆఖరికి సంవత్సరం ఏజ్ పిల్లలకు కూడా ఫోన్ చుస్తే చాలు ఏడుపు ఆపేస్తారు.ఇలా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి.
దీంతో కొన్ని రకాల జీవరాసులు వీటి వల్ల అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.ముఖ్యంగా కొన్ని రకాల పక్షి జాతి మనుగడ ప్రశ్నర్ధకం అయ్యింది.
సెల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఈ తరంగాల వల్ల పిచుకలు అంతరించి పోతున్నాయి.ఈ సువిశాల ప్రపంచంలో అంత చిన్న ప్రాణి మనుగడ కష్టతరం అవుతుంది.దీనంతటికి కారణం రేడియేషన్.
ఇది రానురాను ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు.మరి అలాంటి పిచుకలకు ఒక యువకుడు సరైన మార్గదర్శకం చూపిస్తున్నాడు.
వాటి గమ్యాన్ని చేరుకొని వాటి మనుగడ కష్టతరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు.ఇతడి ఆలోచన అందరికి బాగా అనిపిస్తుంది.ఇతడు ఆలోచించిన తీరు ఎన్నో పక్షులకు వరంగా మారి హ్యాపీ గా జీవిస్తున్నాయి.
![Telugu Cell, Innovative Idea, Kisan Nagarn, Ramesh, Save Sparrows, Sparrows, You Telugu Cell, Innovative Idea, Kisan Nagarn, Ramesh, Save Sparrows, Sparrows, You](https://telugustop.com/wp-content/uploads/2022/03/innovative-attempt-by-young-man-to-save-sparrows-detailsd.jpg )
క్రీం నగర్ కిసాన్ నగర్ కు చెందిన రమేష్ అనే యువకుడు పిచ్చుకల మనుగడ కోసం ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేసాడు.ఎలా అయినా వాటిని కాపాడు కోవాలని ఒక నిర్ణయానికి వచ్చి.వాటికీ అనుకూలంగా ఉండే వాతావరణం క్రియేట్ చేసి కావలసిన ఆహారం, నీరు కూడా కల్పించి గూడు కూడా ఏర్పాటు చేసాడు.
తన ఇంటి దగ్గరే ఇలా ఏర్పాటు చేయడంతో ఆ పిచ్చుకలు కూడా అక్కడికి వచ్చి ఆహారం తింటూ నీరు తాగుతూ అతడు ఏర్పాటు చేసిన గూడు ల్లోనే ఉంటున్నాయి.రానురాను ఇక్కడికి వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతున్నాయి.
దీంతో అతడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.పిచ్చుకలను రోజు చూస్తుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది అని అతడు చెబుతున్నాడు.