ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో హైలైట్ ఇదే! సెల్యూట్ ఇండియన్ ఆర్మీ!

ఈ రోజు జార్ఖండ్ లో రాంచి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అయ్యింది.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్స్ లో ఆకర్షణగా నిలిచింది వారు ధరించిన టోపీ.పుల్వామా ఎటాక్ లో చనిపోయిన జవాన్ల కుటుంబాలకి నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ మూడో వన్డే మ్యాచ్ ఫీజ్ లో ఎబ్భై శాతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి డొనేట్ చేయడానికి రెడీ అయ్యారు.

ఈ మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్స్ ఆర్మీ జవాన్స్ కుటుంబాలకి తమ వంతు ఆర్ధిక సాయం అందించడానికి గాను మ్యాచ్ ఫీజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.అందుకు గాను ఈ మ్యాచ్లో టీం ఇండియా క్రికెటర్స్ అందరూ ఆర్మీ సింబాలిక్ టోపీలని ధరించి మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యారు.

ఎప్పుడు సాధారణ క్రికెట్ టోపీలతో ఆడే టీం ఇండియా క్రికెటర్స్ రాంచి మ్యాచ్ లో ఆర్మీ క్యాప్ పెట్టుకొని ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పాలి.

Advertisement
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు