కరోనా ఎంత పని చేస్తివే.. టోర్నీ నుండి భారత్ బృందం ఔట్..!

కరోనా వైరస్ దేశంలో ఎంత అల్ల కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారు.

 India Out Of The Tournament As Corona Is Doing Well Carona Effect,  Bharath, Ind-TeluguStop.com

సినీ నటులతో సహా క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పుడు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది.

భారత్ కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా సోకింది.అందుకనే వారు ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తెలిపింది.

గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారంటే.

కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సిమ్రాన్ అమన్ సింగ్, రిథికా రాహుల్, మిథున్ మంజునాథ్, థెరిసా జాలీ, కుషి గుప్తాలు ఉన్నారు.టోర్నిలో పాల్గొన్న ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది.

Telugu Bharath, Carona Effect, Cricket, Indian Tean-Latest News - Telugu

వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లనూ టోర్నీ నుంచి తప్పుకోమని తెలిపారు.కాగా కరోనా సోకిన ప్లేయర్స్ కు బదులు ఎవరినీ తీసుకోమని ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్ కు పంపిస్తాం” అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube