వరంగల్ లో మెడికో ప్రీతి మృతి కేసుపై పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి తీరుపై ప్రీతి మరింత మనస్తాపం చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కౌన్సిలింగ్ లో ప్రీతి కన్నీరు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు.
డాక్టర్ ప్రీతి ఆడియోల్లోనూ హెచ్ఓడీ పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.లీవ్, కౌన్సిలింగ్ అంశంలో నాగార్జున రెడ్డి తీరు వివాదాస్పదం అవుతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రీతి వేధింపులకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వస్తున్నారని సమాచారం.







