సంగారెడ్డి జిల్లాలో కత్తితో వ్యక్తి వీరంగం... ముగ్గురిపై దాడి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దారుణం జరిగింది.వాణినగర్ లో ఓ వ్యక్తి డ్యూటీలకు వెళ్తున్న సమయంలో ముగ్గురిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే కుటుంబ కలహాలతోనే దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

మృతురాలు సుజాత వాణినగర్ లో తన అక్క ఇంటికి వచ్చి దాడిలో చనిపోయిందని తెలిపారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు