మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆధార్ కార్డు లేని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా స్కూల్ యూనిఫాం వంటి ఇతర సదుపాయాలను సైతం తొలగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఈ నిబంధనలు 2023 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని సర్కార్ వెల్లడించింది.మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 2.33 కోట్ల మంది విద్యార్థులున్నారు.అయితే ఈ సరికొత్త నిబంధన కారణంగా ఆధార్ లేని సుమారు 59 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.