కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) అన్నారు.తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలను అమలు చేశామని చెప్పారు.
ఈ నెల 27న మరో రెండు పథకాలను అమలు చేస్తామని తెలిపారు.చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) సమక్షంలో రూ.500 లకే గ్యాస్, 200 యూనిట్లకుఉచిత విద్యుత్ ను అమలు చేస్తామని వెల్లడించారు.ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.పోడు భూములకు కూడా పట్టాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.